ఉద్యోగ ప్రస్థానం

ఉపాధ్యాయునిగా,సామాజిక సేవకుడిగా,పేద విధ్యార్థులపెన్నిధిగా,పట్టుదల వ్యక్తిగా క్రమశిక్షణకు మారుపేరుగా గుర్తింపు పొందారు బెక్కంటి శ్రీనివాసరావు.ప్రస్తుతం బెక్కంటి భద్రాచలంలోని నన్నపనేని మోహన్ హైస్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో ప్రభుత్వ నిధులు లేకుండా తల్లితండ్రులను ,స్వచ్చంద సేవా సంస్థలను పాఠశాలలకు రప్పించి శాశ్వత నిర్మాణాలు చేసి తన ముద్రను భద్రపరచుకొని తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు.

 మిట్టగూడెం,ఇబ్రహీం పేట,శ్రీధర,బూర్గం పాడు,సారపాక,మోతే గ్రామాల్లో పనిచేశారు.తాను పనితీరులో తోటివారికి ఒక రోల్ మోడల్ గా నిలిచారు.1998 నుండి డిపెప్ మండల రిసోర్స్ పర్సన్ గా పనిచేసిన కాలం నందు 2002 లో బూర్గం పాడు మండలంలో అక్షర సంక్రాంతిలో 90 రోజులపాటు అక్షర యఙ్నం చేసి 5000 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చారు.ఇది రాష్ట్రంలో ఒక రికార్డ్. ఆనాటి రాష్ట్ర కేబినెట్ మంత్రులైన సరస్వతి,మణికుమారిల ప్రశంసలు పొందారు. 2002 లో ఆనటి జిల్లా కలక్టర్ గిరిధర్ చేతులమీదుగా తొలి ఉత్తమ మండల రిసోర్స్ పర్సన్ అవార్డ్ అందుకున్నారు.

పవిత్ర ఉపాధ్యాయ వ్రుత్తిలో కావలసిన ప్రతిభ ,అంకిత భావం,క్రమశిక్షణ,సేవా ద్రుక్పథం,మంచి నడవడి లక్షణాలను కలబోసిన బెక్కంటి ఊహించని రీతిలో ఎన్నో...ఎన్నెన్నో అవార్డులు,రివార్డులు లను కైవసం చేసుకున్నారు.వీటిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2009 లో సెప్టెంబర్ 5న రవీంద్రభారతిలో ముఖ్య మంత్రి కె.రోశయ్య ,విద్యా శాఖా మంత్రులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కరంతో సత్కరించారు.